ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలన బ్రిటిష్‌ పాలనను తలపిస్తోంది : బీజేపీ

ABN, First Publish Date - 2022-05-17T02:41:13+05:30

నేటి వైసీపీ నేతల పాలన నాటి బ్రిటిష్‌ పాలనను తలపిస్తోందని నెల్లూరు పార్లమెంటు బీజేపీ అధ్యక్షుడు భరత్‌కుమా

: సమావేశంలో మాట్లాడుతున్న భరత్‌కుమార్‌ యాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు, మే 16:  నేటి వైసీపీ నేతల పాలన నాటి బ్రిటిష్‌ పాలనను తలపిస్తోందని నెల్లూరు పార్లమెంటు బీజేపీ అధ్యక్షుడు భరత్‌కుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. పట్టణంలోని మార్కండేయస్వామి ఆలయ ఫంక్షన్‌ హాలులో సోమవారం నియోజకవర్గ స్థాయి  నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కర్నాటకతో పోలిస్తే మనరాష్ట్రంలో పెట్రోలు లీటరు ధర రూ. 16 అధికంగా ఉందన్నారు. జగన్మోహన్‌రెడ్డి అధ్వాన పాలన వలన రాష్ట్రం నేడు అప్పుల ఊబిలో  కూరుకుపోయిం దన్నారు. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో బీజేపీ బలోపేతం అయ్యేందుకు శక్తికేంద్రాల ప్రముఖుల సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు మహిళా మోర్చా రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ సహాధ్యక్షురాలు ఉన్నం నళినీదేవి తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు వంశీధర్‌ రెడ్డి, యశ్వంత్‌సింగ్‌, పాలడుగు సుభాషిణి, పీ. రమేష్‌ యాదవ్‌,ఎన్‌. రాజేష్‌, ఈ.సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

----------


Updated Date - 2022-05-17T02:41:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising