ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరేడు వైసీపీలో భగ్గుమన్న వర్గపోరు

ABN, First Publish Date - 2022-06-25T05:17:03+05:30

మండలంలోని కరేడు వైసీపీలో వర్గపోరు భగ్గుమంది. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం, అనుకూల వర్గాల మధ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉలవపాడు, జూన్‌ 24 : మండలంలోని కరేడు వైసీపీలో వర్గపోరు భగ్గుమంది. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం, అనుకూల వర్గాల మధ్య శుక్రవారం వాదోపవాదాలు జరిగాయి. వైసీపీ అస మ్మతి వర్గం నాయకులు కందుకూరు, వలేటివారిపాలెంకు చెందిన కొందరితో కలిసి కందుకూ రు వైసీపీ ప్లీనరీలో జరిగిన అవమానంపై విలేకరుల సమావేశం నిర్వహించ తలపెట్టారు. ఈ విషయం తెలిసిన కరేడు వైసీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు, సర్పంచు, ఎంపీపీ భర్త, ఇతర ప్రజా ప్రతినిధులు దానిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పార్టీలో ఉంటూ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం సహించేది లేదని వాదనకు దిగారు. అయితే ప్లీనరీలో కావాలనే తమను అవమానించారని తమగోడు పత్రికా సమావేశం ద్వారా అధిష్టానానికి చెప్పుకోవాలని భావిం చామని అసమ్మతి వర్గం నేతలు వాదించారు. కందుకూరు నుంచి కొల్లూరు కొండయ్య (గ్యాస్‌ కొండయ్య), పువ్వాడ రమణయ్య, వలేటివారిపాలెం మండల వైసీపీ కన్వీనర్‌ ప్రవీణ్‌, మాచవరం చిరంజీవిరెడ్డి, కరేడుకు చెందిన చెంచురామిరెడ్డి, మిరియం శ్రీనివాసులు, సుబ్బా రెడ్డితో కలిసి సమావేశమయ్యారు. విషయం త్వరలో వైసీపీ అధిష్టానానికి తెలియచేసి న్యాయం జరిగే వరకు పోరాడతామని అసమ్మతి నేతలు సమావేశం అనంతరం ఒక ప్రకటనలో తెలిపారు.


Updated Date - 2022-06-25T05:17:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising