ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నడిరోడ్డులో నిలువెత్తు గుంత

ABN, First Publish Date - 2022-01-15T04:24:13+05:30

మండలంలోని యాగర్ల కూడలి వద్ద నడిరోడ్డుపై నిలువెత్తు గుంత ఏర్పడి ప్రయాణికులకు ప్రమాదకరంగా మారింది.

యాగర్ల కూడలి వద్ద మూడు మలుపుల రోడ్డు (అంతర్‌చిత్రంలో) నడిరోడ్డుపై ఏర్పడిన గుంత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్టించుకోని అధికారులు


ఇందుకూరుపేట, జనవరి 14 : మండలంలోని యాగర్ల కూడలి వద్ద నడిరోడ్డుపై నిలువెత్తు గుంత ఏర్పడి ప్రయాణికులకు ప్రమాదకరంగా మారింది. మూడు మండలాల కూడలి అయిన వంతెనపై ఈ గుంత రెండు అడుగుల వెడల్పుతో ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఈ వంతెన కింద  నిండుగా ప్రవహించే జాఫర్‌సాహెబ్‌ కాలువ ఉండడం, ఏదైనా ప్రమాదం జరిగితే పెనుముప్పు ఏర్పడే అవకాశం ఉంది. అధికారులు మాత్రం గుంత వద్ద ముళ్ల కంప వేసి, ఎర్రగుడ్డను ఓ కర్రకు పాతారు. ఈ మలుపులు ఉన్న వంతెన వద్ద కొత్తవారు గానీ, తెలియని వారు చీకట్లో వచ్చినా ప్రమాదం తప్పనిసరి. అందులోనూ ఆక్వా పరిశ్రమలు, రైతులు, బీచ్‌ పర్యాటకులతో నిత్యం రద్దీగా ఉండే రహదారిపై తక్షణం చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2022-01-15T04:24:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising