ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూరింటికి మంటలు: మహిళ సజీవదహనం

ABN, First Publish Date - 2022-01-29T04:52:55+05:30

ద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో పూరింటికి మంటలు వ్యాపించడం తో మతిస్థిమితం లేని మహిళ సజీవ దహనమైన దుర్ఘటన శుక్రవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏఎస్‌పేట, జనవరి 28: విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో పూరింటికి మంటలు వ్యాపించడం తో మతిస్థిమితం లేని మహిళ సజీవ దహనమైన దుర్ఘటన శుక్రవారం తెల్లవారుజామున ఏఎస్‌పేటలో చోటుచేసుకుంది. గ్రామంలోని షాపబావి వద్ద ఓ వ్యక్తి సంరక్షణలో కొంత మంది మానసిక రోగులు ఉంటున్నారు. వారు ఉండే ఇంటి ఆవరణలోనే పూరిల్లు కూడా ఉంది. ఈ క్రమంతో గురువారం రాత్రి ఇద్దరు మానసిక మహిళలు పూరింటిలోకి వెళ్లి నిద్రపోయారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో  మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారు ఒక మహిళను బయటకు తేవడంతో స్వల్ప గాయాలతో బయటపడింది. హైదరాబాదుకు చెందిన మరో మహిళ ఫాతిమా ముష్రఫ్‌ (47) మంటల్లోనే చిక్కుకుంది. అగ్నిమాపక వాహనం వచ్చి మంటలు అదుపు చేసే లోగా ఆమె సజీవ దహనం అయింది. ఆత్మకూరు సీఐ వేణుగోపాల్‌రెడ్డి, ఏఎస్‌పేట ఎస్‌ఐ సుబహని ఘటనాస్థలిని పరిశీలించి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

Updated Date - 2022-01-29T04:52:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising