వాటర్ప్లాంట్ ప్రారంభం
ABN, First Publish Date - 2022-01-28T02:48:00+05:30
మండలంలోని కాకొల్లువా రిపల్లి బీసీ కాలనీలో మాధవరపు నాగేంద్ర మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మించిన మినరల్
వరికుంటపాడు, జనవరి 27: మండలంలోని కాకొల్లువా రిపల్లి బీసీ కాలనీలో మాధవరపు నాగేంద్ర మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మించిన మినరల్ వాటర్ప్లాంట్ను ట్రస్టు వ్యవస్థాపకుడు నాగరాజు గురువారం ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి నాగేంద్ర 6వ వర్థంతిని పురస్కరించుకొని కాలనీ వాసుల తాగునీటి సమస్య పరిష్కారానికి తమవంతు బాధ్యతగా ఉచిత మినరల్ వాటర్ప్లాంట్ను సొంత నిధులతో నిర్మించి ప్రారంభించామన్నారు. స్నేహితుడు తురకా తిరుపాలు సొంత నిధులతో గది నిర్మాణం చేపట్టడం అభినందనీయమ ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాధవరపు నాగేంద్ర, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-28T02:48:00+05:30 IST