ఓటర్ల జాబితాను పక్కాగా రూపొందించాలి
ABN, First Publish Date - 2022-11-28T21:39:22+05:30
ఓటర్ల జాబితాను పక్కాగా రూపొందించాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు సత్యనారాయణ అన్నారు. మనుబోలు హైస్కూల్లో సోమవారం బీఎల్వో కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
మనుబోలు, నవంబరు 28 : ఓటర్ల జాబితాను పక్కాగా రూపొందించాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు సత్యనారాయణ అన్నారు. మనుబోలు హైస్కూల్లో సోమవారం బీఎల్వో కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఓటర్ల నమోదును ఎలా చేస్తున్నారో బీఎల్వోలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓట్లు సక్రమంగా ఉంటేనే నమోదు చేయాలన్నారు. ఒకరికి రెండు చోట్ల ఓట్లు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మరణించిన వారి పేర్లను తొలగించాలన్నారు. అవకతవకలకు పాల్పడితే అందరూ ఇబ్బందులు పడుతారని హెచ్చరించారు. ఆయన వెంట ఆర్డీవో మలోల, తహసీల్దార్, సుదీర్, ప్రధానోపాధ్యాయుడు డేవిడ్ తదితరులు ఉన్నారు.
Updated Date - 2022-11-28T21:39:24+05:30 IST