ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన వాలీబాల్‌ పోటీలు

ABN, First Publish Date - 2022-01-18T04:07:27+05:30

వెంకటగిరి పట్టణంలోని విశ్వోదయ జూనియర్‌ కళాశాల క్రీడా ప్రాంగణంలో జీఎన్‌ఆర్‌ సర్వీస్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 16న ప్రారంభమైన కోదండరామయ్య మెమోరియల్‌ వాలీబాల్‌ టోర్నమెంట్‌ సోమవారం ముగిసింది.

విజేత జట్ల సభ్యులతో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటగిరి, జనవరి 17: వెంకటగిరి పట్టణంలోని విశ్వోదయ జూనియర్‌ కళాశాల క్రీడా ప్రాంగణంలో జీఎన్‌ఆర్‌ సర్వీస్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 16న ప్రారంభమైన కోదండరామయ్య మెమోరియల్‌ వాలీబాల్‌ టోర్నమెంట్‌ సోమవారం ముగిసింది.  నాయుడు పేటకు చెందిన ఎస్వీ టైగర్స్‌ జట్టు ప్రథమ స్థానంలో నిలిచి రూ.25 వేలు , రెండవ స్థానంలో నిలిచిన నెల్లూరు అసోసియేషన్‌ - 2 జట్టు రూ 15వేలు, మూడవ స్థానంలో నిలిచిన నెల్లూరు అసోసియేషన్‌ - 1 జట్లు రూ. 10వేలు, నాలుగో స్థానంలో నిలిచిన వడమాలపేట శ్రీను జట్టు రూ.10 వేలు నగదు బహుమతులను అందుకున్నాయి.  మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నగదు బహుమతులను అంద చేశారు. యువక్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ట్రస్టు అధినేత గంగోటి నాగేశ్వరావును ఈ సందర్భంగా ఆయన అభినందించారు. వివిధ క్రీడల్లో ప్రతిభ కనపరిచిన పలువురు క్రీడా కారులను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు వల్లభనేని మధునాయుడు, డాక్టర్‌ రవీంద్రనాథ్‌, బీకే ప్రసాద్‌, చెంగల్‌రాయుడు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-18T04:07:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising