ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాదాలు సృష్టించడం సరికాదు

ABN, First Publish Date - 2022-09-29T04:07:21+05:30

గతంలో తమకు కేటాయించిన ఇళ్ల స్థలాల విషయంలో వివాదాలు సృష్టించడం సరికాదని ముదివర్తి దళిత కాలనీ వాసులు

విలేకరులతో మాట్లాడుతున్న ముదివర్తి దళిత కాలనీవాసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విడవలూరు, సెప్టెంబరు 28: గతంలో తమకు కేటాయించిన ఇళ్ల స్థలాల విషయంలో వివాదాలు సృష్టించడం సరికాదని ముదివర్తి  దళిత కాలనీ వాసులు   అన్నారు. గ్రామంలో బుధవారం  వారు విలేకరులతో మాట్లాడుతూ 2004లో 54 మందికి 18 అంకణాల చొప్పున పట్టాలు ఇచ్చారేకానీ స్థలాలు చూపటంలో తీవ్ర జాప్యం జరిగిందన్నారు. ఎమ్మెల్యే ప్రసన్న చొరవతో రెవెన్యూ  అధికారులు స్థలాలు కేటాయించారని వివరించారు. అయితే గ్రామానికి చెందిన కొంతమంది  తమకు కేటాయించిన 18 అంకణాల స్థలాన్ని 14 అంకణాలకు తగ్గించి పంచాలని, అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని వారు ఆరోపించారు.  స్థలాన్ని తగ్గించి ఇస్తే కలెక్టరేట్‌  ఎదుట ఆందోళన చేస్తామన్నారు. సమావేశంలో దళిత కాలనీవాసులు చలం సుమలత, పట్టపు జ్యోతి, సోమతాటి సువార్తమ్మ, దొడ్ల నవీన్‌కుమార్‌, సోమతాటి కళాధర్‌, గోడ వజ్రమ్మ, డక్కా రమణమ్మ, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2022-09-29T04:07:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising