విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి
ABN, First Publish Date - 2022-01-21T02:43:27+05:30
మండలంలోని సున్నపుట్టి హైవేకు సమీపంలో ఉండే అటవీ ప్రాంతంలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతి చెందినట్టు
దగదర్తి, జనవరి 20 : మండలంలోని సున్నపుట్టి హైవేకు సమీపంలో ఉండే అటవీ ప్రాంతంలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతి చెందినట్టు ఎస్ఐ సుమన్ తెలిపారు. ఆయన కథనం మేరకు, విడవలూరు మండలం రామతీర్థంకు చెందిన పూడి రామ్మోహన్ (30), అయనకు పిన్ని వరుస అయిన బోగోలు మండలం చెన్నారాయునిపాలెంకు చెందిన పూడి సునీత (35)తో కలిసి బుధవారం ఉదయం రామతీర్థం నుంచి బయలుదేరారు. మార్గమద్యంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలో స్థానికంగా పొలాలపై ఏర్పాటు చేసిన 11 కేవీ విద్యుత్ తీగ కింద పడి ఉంది. దాన్ని చూసుకోక ఇద్దరూ వైరుకు తగలడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందారు. గురువారం సాయంత్రం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఏఎస్ఐ జకీర్, కానిస్టేబుల్ చంద్రశేఖర్ అక్కడకు చేరుకొని వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.
Updated Date - 2022-01-21T02:43:27+05:30 IST