వైభవంగా వేణుగోపాలుడి రథోత్సవం
ABN, First Publish Date - 2022-05-18T03:47:54+05:30
ఉలవపాడులో మంగళవారం సాయంత్రం రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. ఉ
ఉలవపాడు, మే 17: ఉలవపాడులో మంగళవారం సాయంత్రం రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం ఆలయ ప్రాంగణంలో స్వామివారి కల్యాణం జరిగింది. కల్యాణోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొని, స్వామివారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం పురవీధుల్లో స్వామివారి గ్రామోత్సవం జరిగింది. ఈ సందర్భంగా అలయ వ్యవస్థాపక ధర్మకర్తలు కే సుధీర్, చంద్రారెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి జానకమ్మ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కందుకూరు డీఎస్పీ కండె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.ఈ నెల 20వ తేదీతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
Updated Date - 2022-05-18T03:47:54+05:30 IST