Venkaiah: ఏపీ రోడ్ల దుస్థితిపై వెంకయ్యనాయుడు చురకలు
ABN, First Publish Date - 2022-10-04T22:53:33+05:30
ఏపీ రోడ్ల దుస్థితిపై ప్రభుత్వానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చురకలు అంటించారు.
నెల్లూరు (Nellore): ఏపీ రోడ్ల దుస్థితిపై ప్రభుత్వానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) చురకలు అంటించారు. పొదలకూరులో కిషాన్ క్రాఫ్ట్ (Kishan Craft)ను ఆయన సందర్శించారు. అనంతరం వెంకయ్య మాట్లాడుతూ రోడ్లు నిర్వహణ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు. నీరు (Water), రోడ్లు (Roads), విద్యుత్ (Current) వంటి కనీస వసతులు ఉన్నప్పుడే గ్రామాలు, దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టానన్నారు.
Updated Date - 2022-10-04T22:53:33+05:30 IST