టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించాలి
ABN, First Publish Date - 2022-12-09T23:02:46+05:30
టిడ్కో గృహాలను లబ్ధిదారులకు వెంటనే అందించాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి వై.మధు డిమాండ్ చేశారు.
ఆత్మకూరు, డిసెంబరు 9 : టిడ్కో గృహాలను లబ్ధిదారులకు వెంటనే అందించాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి వై.మధు డిమాండ్ చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో 90 శాతం పూర్తయిన టిడ్కో గృహాలను వైసీపీ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు అవుతున్నా లబ్దిదారులకు పూర్తి స్థాయిలో ఇవ్వలేదని విమర్శించారు. కొన్ని చోట్ల లబ్దిదారులకు గృహాలు అందజేసినా మౌలిక వసతులు సమకూర్చడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. జగనన్న కాలనీలకు రూ. కేవలం రూ 1.80 లక్షలు కేటాయించడంతో ఇళ్లను నిర్మించుకోలేక పేదలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అంద జేశా రు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు నారాయణ, శేషాద్రి, నాయబ్బాష, బ్రహ్మానందరెడ్డి, గోపాల్రెడ్డి, కార్యకర్తలు
Updated Date - 2022-12-09T23:02:47+05:30 IST