అరాచక పాలన తప్ప.. అభివృద్ధి ఏది?: మాలేపాటి
ABN, First Publish Date - 2022-07-03T03:47:43+05:30
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచక పాలన తప్ప ఎక్కడా అభివృద్ధి జరగలేదని టీడీపీ కావలి నియోజకవర్గ ఇన్చార్జీ మాలేపాటి సుబ్బానాయుడు పేర్కొన్నారు.
కావలి, జూలై 2: వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచక పాలన తప్ప ఎక్కడా అభివృద్ధి జరగలేదని టీడీపీ కావలి నియోజకవర్గ ఇన్చార్జీ మాలేపాటి సుబ్బానాయుడు పేర్కొన్నారు. స్థానిక 21వ వార్డులో శనివారం సాయంత్రం జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొని పెరిగిన ధరలను వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను ప్రజలు అందచేసి వాటి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సన్నిగంటి భాస్కర్, మనుబోలు శ్రీనివాసులు, పుట్టా సుబ్బయ్య, మొగిలిశెట్టి ఆనంద్, రమేష్ పిళ్లే, బ్రహ్మయ్య, జ్యోతి బాబూరావు, షేక్. మస్తాన్, శ్రీనివాసులు, పుట్ట నర్సయ్య, గొట్టిపాటి రాము, హరిబాబు, చిట్టాబత్తిన మాల్యాద్రి, కే వీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-07-03T03:47:43+05:30 IST