విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు
ABN, First Publish Date - 2022-09-30T04:46:02+05:30
రెవెన్యూ సిబ్బంది విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని నెల్లూరు ఆర్డీవో మలోల హెచ్చరించారు.
నెల్లూరు ఆర్డీవో మలోల
వెంకటాచలం, సెప్టెంబరు 29 : రెవెన్యూ సిబ్బంది విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని నెల్లూరు ఆర్డీవో మలోల హెచ్చరించారు. స్థానిక తహసీల్దారు కార్యాలయంలో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. గ్రామాల్లో నెలకొని ఉన్న రెవెన్యూ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. చుక్కల భూములు, అడంగల్ కరక్షన్, మ్యుటేషన్ వంటి సమస్యలు ఉంటే వాటిని సకాలంలో పూర్తి చేయాలని, రైతులకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. రెవెన్యూ సిబ్బంది ఏ ఒక్కరూ కూడా ఆలసత్వం ప్రదర్శించకుండా బాధ్యయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దారు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-09-30T04:46:02+05:30 IST