అంబేద్కర్ నగర్లో తాగునీటి కష్టాలు
ABN, First Publish Date - 2022-01-28T02:53:37+05:30
కావలి బుడంగుంట అంబేద్కర్నగర్లో పనిచేయని చేతిపంపులతో ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. కూలీనాలీ
పట్టించుకోని అధికారులు
కావలి రూరల్, జనవరి27: కావలి బుడంగుంట అంబేద్కర్నగర్లో పనిచేయని చేతిపంపులతో ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. కూలీనాలీ చేసుకుం టూ కాలనీలో సుమారు 40 కుటుంబాల వారు నివసి స్తున్నారు. కాలనీలో నాలుగు చేతిపంపులు మినహా ఎ లాంటి తాగునీటి వనరులు లేవు. చేతిపంపులన్నీ మరమ్మతులకు గురై, నెలలు గడుస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. అరకొరగా ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా జరుగుతుందని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు కాలనీవాసులు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
Updated Date - 2022-01-28T02:53:37+05:30 IST