ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్‌టీయూ జిల్లా కార్యవర్గం ఎన్నిక

ABN, First Publish Date - 2022-06-26T04:50:55+05:30

రాష్ర్టోపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూఏపీ) జిల్లా నూతన కార్యవర్గం శనివారం ఎన్నికైంది.

నూతనంగా ఎన్నికైన ఎస్‌టీయూ కమిటీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు (విద్య) జూన్‌ 25  : రాష్ర్టోపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూఏపీ) జిల్లా నూతన కార్యవర్గం శనివారం ఎన్నికైంది.  నెల్లూరులోని సీపీఐ జిల్లా కార్యాలయంలో జరిగిన మధ్యంతర కౌన్సిల్‌ సమావేశంలో నూతన సభ్యులను ఎన్నుకోవడంతో పాటు కమిటీ పలు తీర్మానాలు చేసింది. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్‌.తిమ్మన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అసంబద్ధమైన జీవోనెం 117ను రద్దు చేయాలని, పెండింగ్‌లో ఉన్న పీఎఫ్‌, ఈఎల్‌లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిం చకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. జిల్లా కమిటీ నూతన అధ్యక్షుడిగా జి.రాజమనోహర్‌, ప్రధాన కార్యదర్శిగా ఎ.ఏడుకొండలు,  ఆర్థిక కార్యదర్శిగా కె.నరసింహం, సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలను అసోసియేషన్‌ నేతలు గంటా మోహన్‌, జగన్‌మోహన్‌రెడ్డి, దాసరి శ్రీనివాసులు, రమణారెడ్డి పర్యవేక్షించారు. 

Updated Date - 2022-06-26T04:50:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising