నెల్లూరు జిల్లాలో పోలీసుల ఆకృత్యాలు: సోమిరెడ్డి
ABN, First Publish Date - 2022-03-16T20:56:20+05:30
పొలం విషయంలో శ్రీనివాసులు రెడ్డి అనే రైతుని పొదలకూరు పోలీసులు విచక్షణారహితంగా చావగొట్టారు.
నెల్లూరు జిల్లా: పొలం విషయంలో శ్రీనివాసులు రెడ్డి అనే రైతుని పొదలకూరు పోలీసులు విచక్షణారహితంగా చావగొట్టారు. తీవ్రంగా గాయపడిన రైతు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆస్పత్రిలో బాధితుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో పోలీసుల ఆకృత్యాలు మితిమీరుతున్నాయని మండిపడ్డారు. 30 ఏళ్లుగా అన్ని హక్కులతో భూమిని సాగుచేసుకుంటుంటే వైసీపీ నేత తనదంటున్నాడని, పోలీసులు ఏ హక్కు ఉందని శ్రీనివాసులురెడ్డిని కొట్టి, తెల్లకాగితం మీద సంతకం చేయించుకుంటారని ప్రశ్నించారు. అమ్మలు, అక్కలంటే పోలీసులకు గౌరవం లేదా?.. స్టేషన్కు తీసుకువెళ్లి బండబూతులు తిడుతూ చావగొడతారా అంటూ సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2022-03-16T20:56:20+05:30 IST