ఓటీఎస్ పేరుతో పేదలను దోపిడీ చేస్తున్నారు: సోమిరెడ్డి
ABN, First Publish Date - 2022-01-09T19:23:13+05:30
ఓటీఎస్ పేరుతో ప్రభుత్వం పేదలను దోపిడీ చేస్తోందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు.
అమరావతి: ఓటీఎస్ పేరుతో ప్రభుత్వం పేదలను దోపిడీ చేస్తోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పేదల దగ్గర వేల కోట్లు వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇది జగనన్న గృహ హక్కు పథకం కాదని.. గృహ వంచన పథకమని ఆరోపించారు. ప్రభుత్వం దివాళా తీస్తే పేదల నుంచి డబ్బులు వసూలు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసి హక్కు కల్పించాలని, చెల్లని చట్టంతో చేస్తే కుదరదని సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2022-01-09T19:23:13+05:30 IST