ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన

ABN, First Publish Date - 2022-09-27T03:07:26+05:30

తమ గ్రామంలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌యాదవ్‌ ఆధ్వ

ఆందోళన చేస్తున్న కనియంపాడు గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరికుంటపాడు, సెప్టెంబరు 26: తమ గ్రామంలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌యాదవ్‌ ఆధ్వర్యంలో కనియంపాడు గ్రామస్థులు మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని తాగునీటి పథకాలు మరమ్మతులకు గురై నెల రోజులుగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పట్టించుకొనే నాథుడే కరువయ్యారన్నారు. అలాగే పొలాలు, శ్మశానాలకు వెళ్లే రహదారులు కంపచెట్లతో కమ్ముకుపోయాయన్నారు. కనీసం ఉపాధి హామీ పనులు కల్పించడంలో కూడా అధికారులు విఫలమయ్యారన్నారు.  ఇప్పటికైనా సమస్యలను పరిష్కరిం చకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కార్యాలయం ఎదుట బైఠాయించి అధికారుల తీరును నిరసిస్తూ నినాదాలతో హోరెత్తించారు. ఎంపీడీవో విజయభాస్కర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ చండ్ర మధుసూదన్‌రావు, నాయకులు తాతిపూడి లాబాన్‌, పోకా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-27T03:07:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising