సమరయోధుడికి నివాళి.. వారసుడికి సన్మానం
ABN, First Publish Date - 2022-08-19T03:33:22+05:30
ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా మండలంలోని బ్రాహ్మణక్రాకకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు కీ.శే.
జలదంకి, ఆగస్టు18: ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా మండలంలోని బ్రాహ్మణక్రాకకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు కీ.శే. వంటేరు వరదారెడ్డి చిత్రపటానికి గురువారం స్వగ్రామంలో నివాళులర్పించారు. కార్యక్రమానికి హాజరైన తహసీల్ధారు సీతామహాలక్ష్మి వరదారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన కుమారుడు మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర ఉద్యమంలో వరదారెడ్డి బ్రిటీష్వారికి వ్యతిరేకంగా చేసిన పోరాటాలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి ఈ సుధాకర్, పంచాయతీ కార్యదర్శి నీరజ, వీఆర్వో బాలకోటయ్య, బీజేపీ నేతలు బండారు తిరుపతిరెడ్డి, మారెళ్ల బ్రహ్మారెడ్డి, వంటేరు రాకేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-19T03:33:22+05:30 IST