ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమన్వయంతో పని చేస్తేనే ఫలితం

ABN, First Publish Date - 2022-09-27T03:00:28+05:30

మండల టీడీపీ కన్వీనర్లు, క్లస్టర్‌ ఇన్‌చార్జిలు సమన్వయంతో పని చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని టీడీపీ జాతీయ ప్రధాన కా

సమావేశంలో మాట్లాడుతున్న బీద రవిచంద్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  -బీద రవిచంద్ర 

ఉదయగిరి రూరల్‌, సెప్టెంబరు 26: మండల టీడీపీ కన్వీనర్లు, క్లస్టర్‌ ఇన్‌చార్జిలు సమన్వయంతో పని చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పేర్కొన్నారు. సోమవారం స్థానిక చెంచురామయ్య అతిథిగృహంలో మండల టీడీపీ కన్వీనర్‌ బయ్యన్న అధ్యక్షతన సీతారామపురం, ఉదయగిరి మండల నాయకులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ ఓడిపోతామనే భ్రమతో ప్రతి కార్యకర్త కష్టపడి పని చేస్తేనే ఫలితం ఉంటుందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు జరుగుతున్నాయన్నారు. ఉదయగిరి, సీతారామపురం మండలాల్లో సభ్యత్వాల నమోదు, ఓటర్ల జాబితాలు పరిశీలించడంలో సమన్వయలోపం కనిపిస్తుందన్నారు. ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉందని, ప్రతినెలా 9వ తేదీన మండల పార్టీ సమావేశం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బొల్లినేని వెంకటరామారావు, కంభం విజయరామిరెడ్డి,  నాయకులు పొన్నెబోయిన చెంచలబాబుయాదవ్‌, మతకాల శ్రీనివాసులయాదవ్‌, రియాజ్‌, బొజ్జా నరసింహులు, నల్లిపోగు రాజా, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. 


-----------


Updated Date - 2022-09-27T03:00:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising