సమాజశ్రేయస్సే లక్ష్యం
ABN, First Publish Date - 2022-09-25T03:21:45+05:30
స్ధానిక సంస్థల ప్రజాప్రతినిఽధులు సమాజశ్రేయస్సే లక్ష్యంగా పనిచేయాలని వ్యవసాయ సలహామండలి జిల్లా అధ్యక్షుడు దొడ్డంరెడ్డి
కోవూరు, సెప్టెంబరు24: స్ధానిక సంస్థల ప్రజాప్రతినిఽధులు సమాజశ్రేయస్సే లక్ష్యంగా పనిచేయాలని వ్యవసాయ సలహామండలి జిల్లా అధ్యక్షుడు దొడ్డంరెడ్డి నిరంజనబాబురెడ్డి కోరారు. మండలపరిషత్ కార్యాలయంలో శనివారం మండల పరిషత్ పాలకవర్గం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తుమ్మలపెంట పార్వతి, ఉపాధ్యక్షుడు శివుని నరసింహారెడ్డి, జడ్పీటీసీ కవరగిరి శ్రీలత, పీఏసీఎస్ చైౖర్మన్ రామిరెడ్డి మల్లికార్జునరెడ్డి, ఏఎంసీ ఇన్చార్జి చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, మండల ఏఏబీ చైర్మన్ నీలపరెడ్డి హరిప్రసాద్రెడ్ది తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-09-25T03:21:45+05:30 IST