రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN, First Publish Date - 2022-12-09T22:55:14+05:30
చెన్నై లోని వడపళని హైవే సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చేజర్ల మండలం కోటితీర్థం గ్రామానికి చెందిన కంచెర్ల ప్రసాద్ (27) మృతి చెందాడు.
చేజర్ల, డిసెంబరు 9: చెన్నై లోని వడపళని హైవే సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చేజర్ల మండలం కోటితీర్థం గ్రామానికి చెందిన కంచెర్ల ప్రసాద్ (27) మృతి చెందాడు. గ్రామస్థుల వివరాల మేరకు కొన్ని నెలలకుగా కంచెర్ల ప్రసాద్ చెన్నైలోని తన అన్న ఇంట్లో ఉంటూ సాఫ్టేవేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉండే మరో వ్యక్తితో కలిసి బైక్పై వెళుతుండగా లారీ ఢీకొనడంతో అక్కడిక్కడే ఇద్దరూ మృతి చెందారు. ప్రసాద్ మృతితో కుంటుబ సభ్యులు కన్నీరుమున్నీరుగా ఏడ్చారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి.
Updated Date - 2022-12-09T22:55:15+05:30 IST