ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూగజీవాలపై దూసుకెళ్లిన ట్రాక్టరు

ABN, First Publish Date - 2022-07-06T03:24:04+05:30

మండలంలోని వెంకటరెడ్డిపల్లి వద్ద ఆత్మకూరు-సోమశిల ప్రధాన రహదారిపై అతివేగంగా వచ్చిన ట్రాక్టరు మూగజీవాలపై దుసుకెళింది.

రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన గొర్రెల కళేబరాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

15 గొర్రెలు మృతి

అనంతసాగరం, జూలై 5: మండలంలోని వెంకటరెడ్డిపల్లి వద్ద ఆత్మకూరు-సోమశిల ప్రధాన రహదారిపై అతివేగంగా వచ్చిన ట్రాక్టరు మూగజీవాలపై దుసుకెళింది. ఈ ఘటనలో 15 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా మరికొన్ని గాయపడ్డాయి. ప్రమాదానికి కారణమై ట్రాక్టర్‌ సమీపంలోనే బోల్తాపడింది. స్థానికుల కథనం మేరకు.. రేవూరుకు చెందిన ట్రాక్టరు గ్రావెల్‌ లోడుతో వెళ్తూ మేతకు వెళుతున్న గొర్రెలపై దూచుకెళ్లింది. మృతి చెందిన గొర్రెల కళేబరాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ఘటనతో బాధిత రైతు ఊడిబిండి వెంకటేశ్వర్లురెడ్డికి సుమారు రూ.3లక్షల నష్టం వాటిల్లింది. సమాచారం తెలుసుకొన్న అనంతసాగరం ఎస్‌ఐ మహబుబ్‌ సుబానీ సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

Updated Date - 2022-07-06T03:24:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising