ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెవెన్యూ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం : జేసీ

ABN, First Publish Date - 2022-09-18T03:51:19+05:30

జిల్లాలో రెవెన్యూ సమస్యలను ఒకొక్కటిగా పరిష్కరిస్తున్నామని, త్వరలోనే అన్ని సమస్యలు తీరుతాయని జేసీ కూర్మనాథ్‌ అన్నారు. మండ

చెర్లోపల్లి సచివాలయంలో తహసీల్దార్‌తో మాట్లాడుతున్న జేసీ కూర్మనాథ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మనుబోలు, నెల్లూరు జిల్లా: రెవెన్యూ సమస్యలను ఒకొక్కటిగా పరిష్కరిస్తున్నామని, త్వరలోనే అన్ని సమస్యలు తీరుతాయని జేసీ కూర్మనాథ్‌ అన్నారు. మండలంలోని చెర్లోపల్లి సచివాలయాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి సిబ్బంది గురించి ఆరా  తీశారు. చాలా మంది సెలవుల్లో ఉంటే సచివాలయ సమస్యలు ఎవరు పరిష్కారిస్తారని మండిపడ్డారు. వచ్చేది వర్షాకాలమని, సీజనల్‌ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏఎన్‌ఎంకు సూచించారు.  వీఆర్‌వోలకు రెవెన్యూ గ్రామాల మార్పు ఉండదని జేసీ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ సుదీర్‌, ఈవోఆర్‌డీ రమణయ్య, సర్వేయర్‌ గోపికృష్ణ  తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-18T03:51:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising