ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

20 టన్నుల రేషన్‌బియ్యం పట్టివేత

ABN, First Publish Date - 2022-07-06T03:11:59+05:30

ప్రకాశం జిల్లా కేంద్రంగా చెన్నైకి తరలిపోతున్న రేషన్‌బియ్యాన్ని మంగళవారం విజిలెన్స్‌ అధికారులు వలపన్ని పట్టుకున్నారు

కొమ్మలపూడి క్రాస్‌ రోడ్డు వద్ద పట్టుబడిన రేషన్‌బియ్యంతో విజిలెన్స్‌ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మనుబోలు, జూలై 5:  ప్రకాశం జిల్లా కేంద్రంగా చెన్నైకి తరలిపోతున్న రేషన్‌బియ్యాన్ని మంగళవారం విజిలెన్స్‌ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 20టన్నుల రేషన్‌బియ్యం తరలిస్తున్న లారీని వెంబడించి మనుబోలు మండలం కొమ్మలపూడి క్రాస్‌రోడ్డు వద్ద దాడులు చేసి లారీడ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, లారీని స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్‌ ఎస్పీ రాజేష్‌రెడ్డి ఆదేశాలతో పక్కా సమాచారం అందుకున్న విజిలెన్స్‌ అధికారులు సీఐ మాణిక్యరావు ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. పట్టుబడిన లారీలో 50కేజీ బస్తాలు 520వరకు ఉన్నాయి. వీటి విలువ రూ. 5.72లక్షలు. లారీతో కలిపి రూ.15.72లక్షలుగా రికార్డు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. రేషన్‌బియ్యం తరలింపుపై 6ఏతోపాటు క్రిమినల్‌ కేసు నమోదు చేయనున్నట్లు ఆయన  తెలిపారు. పట్టుబడిన లారీని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ఈ దాడుల్లో జేఎస్‌వో రవిబాబు , సీఎస్‌డీటీ లక్ష్మీనారాయణరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2022-07-06T03:11:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising