వ్యవసాయ మోటార్లకు మీటర్లు వద్దు: రైతులు
ABN, First Publish Date - 2022-08-16T04:29:24+05:30
వ్యవసాయ మోటార్లకు మీటర్లు వద్దని కోరుతూ సోమవారం రైతుసంఘం నాయకులు బసినేనిపల్లిలో ర్యాలీ నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు.
సీతారామపురం, ఆగస్టు 15 : వ్యవసాయ మోటార్లకు మీటర్లు వద్దని కోరుతూ సోమవారం రైతుసంఘం నాయకులు బసినేనిపల్లిలో ర్యాలీ నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ కౌలు రైతులకు రైతుభరోసా ఇవ్వాలని, ఆర్బీకేల ద్వారా రైతుల పంటలను కొనుగోలు చేయాలని, ఉపాధిహామీ పనులను ప్రతి ఒక్కరికి కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మంగళవారం సీతారామపురం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు జరిగే వ్యవసాయరంగ పరిరక్షణ జాతాను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కాకు వెంకటయ్య, కోడె రమణయ్య, నాగూర్సాహెబ్, రైతులు తదితరులు పాలొగన్నారు.
Updated Date - 2022-08-16T04:29:24+05:30 IST