రథ నిర్మాణ పనులు ప్రారంభం
ABN, First Publish Date - 2022-01-25T06:21:59+05:30
బోగోలు మండలం కొండబిట్రగుంట బిలకూట క్షేత్ర నివాసి ప్రసన్న వేంకటేశ్వరుని నూతన రథ నిర్మాణ తొలి బిగింపు సోమవారం ఆలయ
బిట్రగుంట, జనవరి 24: బోగోలు మండలం కొండబిట్రగుంట బిలకూట క్షేత్ర నివాసి ప్రసన్న వేంకటేశ్వరుని నూతన రథ నిర్మాణ తొలి బిగింపు సోమవారం ఆలయ పాలక మండలి చైర్మన్ శ్రీరాంమాల్యాద్రి, ఈవో రాధాకృష్ణల ఆధ్వర్యంలో జరిగాయి. కావలి ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్రెడ్డి ముఖ్యఅతిఽథిగా హాజరయ్యారు. పాలక మండలి చైర్మన్ మాట్లాడుతూ ఫిబ్రవరి రెండోవారం లోపు రథం బిగించడం పూర్తి చేసి ట్రయల్ రన్కు సన్నాహాలు చేస్తునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థపతి సురేంద్ర, సర్పంచు శ్రీరాం గోపాల్, పాలక మండలి సభ్యులు, వైసీపీ మాజీ మండల కన్వీనర్ వీరరఘు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-25T06:21:59+05:30 IST