పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ABN, First Publish Date - 2022-06-24T04:04:54+05:30
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలను పాడిరైతులు సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్
అల్లూరు, జూన్ 23 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలను పాడిరైతులు సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ బీ మహేశ్వరుడు కోరారు. అల్లూరు ప్రాంతీయ పశువైద్యశాలలో అల్లూరు, బోగోలు మండలాల పశువైద్యాధికారులు, సిబ్బందితో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశుకిసాన్ క్రెడిట్ కార్డును పొందాలన్నారు. ప్రధానమంత్రి శ్రమయోగి మాంధన్ పథకం వివరాలను తెలిపారు. వీటిని పాడిరైతులు, గొర్రెల రైతులు తప్పకుండా తీసుకోవాలన్నారు. జిల్లా పశుగణ అభివృద్ధి శాఖ ఈవో సోమయ్య తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అల్లూరు ఏడీ మాలకొండయ్య, వైద్యాధికారులు గౌతమ్, సుజిని, శ్రావణ్, రాము, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-06-24T04:04:54+05:30 IST