తొమ్మిది గ్రావెల్ టిప్పర్ల స్వాధీనం
ABN, First Publish Date - 2022-06-25T04:42:19+05:30
మండలంలోని కురిచెర్లపాడు వద్ద శుక్రవారం ఎస్ఐ అయ్యప్ప తొమ్మిది గ్రావెల్ టిప్పర్లు స్వాధీనం చేసుకున్నారు.
వెంకటాచలం, జూన్ 24: మండలంలోని కురిచెర్లపాడు వద్ద శుక్రవారం ఎస్ఐ అయ్యప్ప తొమ్మిది గ్రావెల్ టిప్పర్లు స్వాధీనం చేసుకున్నారు. కురిచెర్లపాడు క్వారీ నుంచి అనుమతులు లేకుండా గ్రావెల్ను పోర్టురోడ్డు, గూడూరు మార్గాలవైపు తరలిస్తున్నట్లు వీఆర్వో ఫిర్యాదు చేశారు. దాంతో ఎస్ఐ అక్రమంగా తరలిస్తున్న గ్రావెల్ టిప్పర్లును అడ్డుకున్నారు. తొమ్మిది టిప్పర్లపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Updated Date - 2022-06-25T04:42:19+05:30 IST