నెల్లూరు జిల్లాలో రైతుల వినూత్న నిరసన
ABN, First Publish Date - 2022-03-12T18:17:46+05:30
నెల్లూరు జిల్లా: రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కోవూరు తహసీల్దార్ కార్యాలయంలో...
నెల్లూరు జిల్లా: రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కోవూరు తహసీల్దార్ కార్యాలయంలో రైతులు వినూత్న నిరసన తెలిపారు. కార్యాలయం ఆవరణలోనే నిద్ర చేసి నిరసన తెలిపారు. రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోళ్లు లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకుంటున్నా ఫలితం లేకుండా పోయింది.
వరికోతలు చేసి నెలరోజులు అవుతున్నా.. కొనుగోళ్లు లేకపోవడంతో అన్నదాతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఐదు రోజులుగా ఎమ్మార్వో కార్యాలయం వద్ద వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని వాపోతున్నారు.
Updated Date - 2022-03-12T18:17:46+05:30 IST