ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారు.. వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-01-10T18:42:52+05:30

టాలీవుడ్‌ను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టాలీవుడ్‌ను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. అసలు సినిమా వారికి ఏపీ అంటే గుర్తుందా? అని ప్రశ్నించారు. టిక్కెట్ రేట్లు తగ్గిస్తే సామాన్యులు కూడా సినిమాలు చూస్తారని, ప్రభుత్వ నిర్ణయంలో తప్పేంటని ఆయన సమర్ధించుకున్నారు. కాగా మంత్రి పేర్ని నాని, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ సమయంలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.


నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తరచుగా ఎవరో ఒకరిపై ఆరోపణలు చేయడం ఆయనకు అలవాటు.. సోమవారం కోవూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు సినిమా వాళ్ల గురించి మాట్లాడారు. సినిమా వాళ్లంతా హైదరాబాద్‌లో ఉన్నారని, వారికి ఏపీ కనిపిస్తుందా? అని ప్రశ్నించారు. బలిసి కొట్టుకుంటున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. కేవలం నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తన ఇమేజ్ పెంచుకోవడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై ప్రధాన హీరోల అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Updated Date - 2022-01-10T18:42:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising