ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దాతలను సకల మర్యాదలతో స్వాగతించాలి : ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2022-10-09T04:28:58+05:30

ఆలయ అభివృద్ధికి చేయూతనిచ్చే దాతలను ఆలయ సకల మర్యాదలతో స్వాగతించాలని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి తెలిపారు.

మాలకొండలో శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వలేటివారిపాలెం, అక్టోబరు 8 : ఆలయ అభివృద్ధికి చేయూతనిచ్చే దాతలను ఆలయ సకల మర్యాదలతో స్వాగతించాలని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని మాలకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జలదంకి మండలం కర్కోలపాలెంనకు చెందిన దాతలు చేబ్రోలు బాబూరావు, ఆయన ధర్మపత్ని సుజాత, కుమారులు మధుసూదన్‌, మణిదీ్‌ఫలు అన్నదానంకు ఏర్పాటు చేసిన స్టీమ్‌ బాయిలర్‌ కుక్కర్స్‌ను ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి దాతలతో కలిసి శనివారం ప్రారంభించారు. అనంతరం లడ్డూ నాణ్యతను, భక్తులకు పెట్టే అన్నం, కేశఖండనశాలను, క్యూలైన్లు, దర్శన టిక్కెట్లు కౌంటర్‌, ఫలహారశాలను ఆయన పరిశీలించారు. దర్శనానికి వచ్చే భక్తులను ఆలయ సిబ్బంది గౌరవంగా స్వామి అని పిలవాలన్నారు. కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్‌ కేబీ శ్రీనివాసరావు, కందుకూరు మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ దివి లింగయ్యనాయుడు, ఎస్‌ఐ సుదర్శన్‌, జడ్పీటీసీ దంపతులు  ఇంటూరి భారతి, హరిబాబు, సర్పంచులు చెన్నిబోయిన ఓబులుకొండయ్య, డేగా వెంకటేశ్వర్లు, ఇరపని సతీష్‌, వింజం వెంకటేశ్వర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-09T04:28:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising