Lokesh: రేపు నెల్లూరులో లోకేష్ పర్యటన
ABN, First Publish Date - 2022-09-06T18:21:56+05:30
టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ రేపు(బుధవారం) జిల్లాలోని కావలిలో పర్యటించనున్నారు.
అమరావతి: టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ (Lokesh) రేపు(బుధవారం) జిల్లాలోని కావలిలో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం ముసునూరు గ్రామంలో దుగ్గిరాల కరుణాకర్ కుటుంబాన్ని లోకేష్ (TDP Leader) పరామర్శించనున్నారు. వైసీపీ నేతల (YCP Leaders) వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఇటీవల లేఖ రాసి ఎస్సీ యువకుడు దుగ్గిరాల కరుణాకర్ చనిపోయిన విషయం తెలిసిందే. రేపు నారా లోకేష్(TDP National General Secretary) వెంట టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలు కావలికి భారీగా బయలుదేరి వెళ్లనున్నారు. కాగా.. ఇటీవల నారా లోకేష్ శ్రీకాకుళం, విశాఖ పర్యటనలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తాజాగా రేపు కావలి పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Updated Date - 2022-09-06T18:21:56+05:30 IST