న్యాయశాఖ ఉద్యోగుల ఆందోళన
ABN, First Publish Date - 2022-01-25T04:42:01+05:30
నెల్లూరు జిల్లా న్యాయశాఖ ఉద్యోగులు సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి జిల్లా కోర్టు ప్రాంగణం ముందు ఆందోళన చేపట్టారు.
నెల్లూరు(లీగల్), జనవరి 24: నెల్లూరు జిల్లా న్యాయశాఖ ఉద్యోగులు సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి జిల్లా కోర్టు ప్రాంగణం ముందు ఆందోళన చేపట్టారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా రాష్ట్ర న్యాయశాఖ ఇచ్చిన పిలుపు మేరకు న్యాయశాఖ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి వారికి మద్దతుగా ఈ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి పీ.నారాయణరెడ్డి, రాష్ట్ర నాయకులు ఎస్.చక్రవర్తి, కే.నరసింహారావు, జిల్లా నాయకులు పీ రవికుమార్, ఆర్వీ రమణయ్య, విజయమ్మ, రమాదేవి, తదితర న్యాయశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-25T04:42:01+05:30 IST