ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తిశ్రద్ధలతో విగ్రహాల ప్రతిష్ఠ

ABN, First Publish Date - 2022-05-26T04:41:31+05:30

కావలి పట్టణం మద్దూరుపాడు జాతీయ రహదారి వద్దనున్న వీరాంజనేయస్వామి ఆలయంలో బుధవారం వీరాంజనేయస్వామి, గణపతి, సుబ్రమణ్యస్వాముల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది.

విగ్రహ ప్రతిష్ఠ పూజల్లో ఉభయదాతలు, అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలిటౌన్‌, మే 25: కావలి పట్టణం మద్దూరుపాడు జాతీయ రహదారి వద్దనున్న వీరాంజనేయస్వామి ఆలయంలో బుధవారం వీరాంజనేయస్వామి, గణపతి, సుబ్రమణ్యస్వాముల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. నూతనంగా  నిర్మించిన వీరాంజేయస్వామి ఆలయంలో పరాంకుశం శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో టీటీడీ ఆగమ పండితులు రమేష్‌ ఆచార్యులు పర్యవేక్షణలో జరిగిన విగ్రహ  ప్రతిష్ఠామహోత్సవంలో భక్తజనం పెద్దఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతసేవలతో  ప్రారంభించిన పూజలు హోమం, మూలమంత్ర హోమం, యంత్ర, శిఖర ప్రతిష్ఠ, పూర్ణాహుతి, కుంభాభిషేకం, గోబ్రాహ్మణ సందర్శనం, సర్వదర్శనం తదితర  పూజలతో జరిగిన విగ్రహమహోత్సవం భక్తులను కనువిందు చేసింది. మధ్యాహ్నం భక్తులకు అన్నసంతర్పణ గావించారు. ఆలయ  కమిటీ అధ్యక్షులు ప్రదాన కార్యదర్శి గుత్తికొండ కిషోర్‌, మన్నెమాల కృష్ణారెడ్డి  ప్రమీలమ్మ దంపతులు, పాల్గొని పూజలు నిర్వహించారు. రాత్రి సీతారాముల కల్యాణం, వీరాంజనేయస్వామి పల్లకీ  సేవలు,  గ్రామోత్సవం వైభవంగా జరిగాయి.

Updated Date - 2022-05-26T04:41:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising