చికిత్స పొందుతూ కూలీ మృతి
ABN, First Publish Date - 2022-06-25T04:35:28+05:30
మండలంలోని ఇనమడుగు గ్రామంలో గురువారం విద్యుదాఘాతానికి గురై చికిత్స పొందుతున్న భవన నిర్మాణ కూలీ శుక్రవారం మృతి చెందాడు.
కోవూరు, జూన్24: మండలంలోని ఇనమడుగు గ్రామంలో గురువారం విద్యుదాఘాతానికి గురై చికిత్స పొందుతున్న భవన నిర్మాణ కూలీ శుక్రవారం మృతి చెందాడు. ఇనమడుగు గ్రామానికి చెందిన మందే శివ (28) భవన నిర్మాణ కూలీగా పనిచేసేవాడు. ఇనమడుగు గ్రామానికి చెందిన శ్రీధర్రెడ్డి ఇంటిని రమణారెడ్డి కాంట్రాక్టుకు తీసుకుని నిర్మిస్తున్నాడు. శివ గురువారం రెండో అంతస్థులోకి ఇనుప కమ్ములు తీసుకువెళ్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే ఆయనను నెల్లూరులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందతూ శివ మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన శ్రీధర్రెడ్డి, రమణారెడ్డిలపై మృతుడి తండ్రి గిరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు. ఎస్ఐ డీ వేంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2022-06-25T04:35:28+05:30 IST