కామాక్షితాయికి వైభవంగా లక్ష కుంకుమార్చన
ABN, First Publish Date - 2022-06-27T04:42:13+05:30
మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయంలో ఆదివారం కామాక్షితాయికి లక్ష కుంకుమార్చన అత్యంత వైభవంగా జరిగింది.
బుచ్చిరెడ్డిపాళెం,జూన్26: మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయంలో ఆదివారం కామాక్షితాయికి లక్ష కుంకుమార్చన అత్యంత వైభవంగా జరిగింది. 20మందికిపైగా అర్చకులు ఈ పూజలో పాల్గొన్నారు. కోవూరుకు చెందిన సీహెచ్. దయాకర్రావు, వెంకటసుజాత దంపతులు మొక్కుబడి నిమిత్తం లక్షకుంకుమార్చనకు ఉభయకర్తలుగా వ్యవహరించారు. పూజల అనంతరం ఉభయకర్తలకు ఆలయ అర్చకులు ప్రత్యేక ప్రసాదాలు అందజేశారు. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనం అనంతరం కుంకుమార్చనలో పాల్గొన్నారు.
Updated Date - 2022-06-27T04:42:13+05:30 IST