ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులు చేయవద్దు

ABN, First Publish Date - 2022-01-28T02:41:48+05:30

కొత్త పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులు చేయమని రాష్ట్రప్రభుత్వం ట్రెజరీ ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నదని, అలా చేయకుండా ఉద్య

మాట్లాడుతున్న ఎన్‌జీవో కావలి డివిజన్‌ అధ్యక్షుడు శివకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-శివకుమార్‌

కావలి, జనవరి27: కొత్త పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులు చేయమని రాష్ట్రప్రభుత్వం ట్రెజరీ ఉద్యోగులపై ఒత్తిడి  తెస్తున్నదని, అలా చేయకుండా ఉద్యమానికి  సహకరించా లని ట్రెజరీ ఉద్యోగులను  ఎన్‌జీవో అసోసియేషన్‌ కావలి డివిజన్‌ అధ్యక్షుడు శివకుమార్‌ కోరారు. పీఆర్సీ సాధన సమితి సభ్యులతో కలిసి గురువారం కావలి సబ్‌ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి కొత్త పీఆర్సీతో ఉద్యోగులకు జరిగే నష్టాన్ని వివరించి  బిల్లులు చేయకుండా కార్యాలయం మూసివేసి ఉద్యమానికి మద్దతు తెలపాలని కోరారు. దానికి ట్రెజరీ ఉద్యోగులు కూడా అంగీకరించారు.అనంతరం శివకుమార్‌ మాట్లాడుతూ కొత్త పీఆర్సీ ప్రకారం ఒక్కొక్క ఉద్యోగికి రూ.2వేల నుంచి 10 వేల వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయన్నారు. దాన్ని అంగీకరించకుండా 10  రోజులుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు,, కాంట్రాక్ట్‌ ఉద్యోగసంఘాల నాయకులు తమ హక్కుల కోసం ప్రభుత్వంపై పోరాడుతున్నారని చెప్పారు. పాత జీతాలే కావాలని ఐక్యంగా పోరాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.


Updated Date - 2022-01-28T02:41:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising