పరటాల రవి చిరస్మరణీయుడు
ABN, First Publish Date - 2022-01-25T04:28:41+05:30
మాజీ మంత్రి పరటాల రవి భౌతికంగా మనకు దూరమైనా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని టీడీపీ నగర ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు.
టీడీపీ నగర ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి
నెల్లూరు(వైద్యం), జనవరి 24 : మాజీ మంత్రి పరటాల రవి భౌతికంగా మనకు దూరమైనా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని టీడీపీ నగర ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. సోమవారం నగరంలోని గీతామయి వృద్ధాశ్రమంలో పరటాల రవి 17వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. చెతన్య ఆధ్వర్యంలో వృద్థులకు అన్నదానం, పేద పిల్లలకు భోజన ప్యాకెట్లు అందచేశారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ పరటాల లాంటి ఒక మంచి మనిషికి అనంతరపురం, నెల్లూరుతో పాటు రాష్ట్రమంతా అభిమానులు ఉండటం సహజమన్నారు. అభిమానులు జిల్లాలో ఉన్నారన్నారు. మంచి మనస్సుతో పేదపిల్లలను చేరదీసి ఆశ్రమం నిర్వహిస్తున్న తమ్మినేని పాండుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కువ్వారపు బాలాజీ, పసుపులేటి మల్లికార్జున, నాగేంద్ర, కిషోర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-25T04:28:41+05:30 IST