ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు నష్టం జరగకుండా పరిహారం

ABN, First Publish Date - 2022-07-21T03:57:54+05:30

జాతీయ రహదారి 167బిజి విస్తరణకు సంబంధించి భూసేకరణలో భూములు కోల్పోతున్న భూ యజమానులకు నష్టం జరగకుండా పరిహారం అందుతుందని కావలి ఆర్డీవో శీనానాయక్‌ హామీ ఇచ్చారు.

భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడుతున్న ఆర్డీవో శీనా నాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలి ఆర్డీవో శీనానాయక్‌ హామీ

జలదంకి, జూలై 20: జాతీయ రహదారి 167బిజి విస్తరణకు సంబంధించి భూసేకరణలో భూములు కోల్పోతున్న భూ యజమానులకు నష్టం జరగకుండా పరిహారం అందుతుందని కావలి ఆర్డీవో శీనానాయక్‌ హామీ ఇచ్చారు. బుధవారం బాధిత రైతులతో స్థానిక తహసీల్దారు కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. సమావేశానికి హాజరైన జలదంకి, కమ్మపాలెం, బీకే అగ్రహారం గ్రామాలకు చెందిన భూ యజమానులతో ఆర్డీవో మాట్లాడుతూ కావలి నుంచి దుత్తలూరు వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయన్నారు. అందుకు సంబంధించి చేపట్టిన భూసేకరణలో భూములకు సంబంధించిన పత్రాలు పరిశీలనకే మిమ్మల్ని పిలిపించామన్నారు. మీ భూ హక్కులు నకళ్లు రెవెన్యూ సిబ్బందికి అందజేస్తే చట్టప్రకారం పరిహారం అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు పలు సందేమాలను ఆర్డీవో ముందుంచగా అంతా చట్టప్రకారం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో కార్యాలయ భూసేకరణ సిబ్బంది, డీటీ భరత్‌, ఆర్‌ఐ శ్రీజ, జలదంకి, బ్రాహ్మణక్రాక-2 వీఆర్‌వోలు పద్మ, శివ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-21T03:57:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising