ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాగితాలపూరులో భూ పోరాటం

ABN, First Publish Date - 2022-07-06T03:30:53+05:30

మండలంలోని కాగితాలపూరులో మంగళవారం దళితులు భూపోరాటం చేశారు. వందలమంది దళితులు తమకు ఇళ్లస్థలాల కోసం

కాగితాలపూరు భూపోరాటంలో తిష్టవేసిన దళితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మనుబోలు, జూలై 5: మండలంలోని కాగితాలపూరులో మంగళవారం దళితులు భూపోరాటం చేశారు. వందలమంది దళితులు తమకు ఇళ్లస్థలాల కోసం భూమి కావాలంటూ సర్వేనెం. 85,86లలో ఉన్న ఐదు ఎకరాల భూమివద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రికార్డుల ప్రకారం దొడ్ల వారికి చెందిన ఈభూమిలో చూపబడిన పట్టాదారులు గ్రామంలో ఎవరూ లేరన్నారు.ఈ భూమిని గ్రామానికి చెందిన ఓ భూస్వామి దున్నేసి సాగుచేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. దీంతో పాటు శ్మశానానికి వెళ్ళే దారిని దున్నేశారన్నారు. ఈ భూమిని ఇళ్ళు లేని పేదలకు ఇళ్లస్థలాలు కేటాయించాలని దళితులు డిమాండ్‌ చేశారు. భూపోరాటం దగ్గరికి పోలీసులు చేరుకుని దళితులను పంపివేశారు. ఈ విషయమై వీఆర్‌వో నాగేశ్వరరావును వివరణ కోరగా 5ఎకరాలు పట్టాభూమిగా రికార్డుల్లో ఉందన్నారు. తమకెవరూ ఎలాంటి ఫిర్యాదులు చేయలేదన్నారు.


Updated Date - 2022-07-06T03:30:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising