కార్మికులకు ఇచ్చిన హామీలు మరిచిన సీఎం
ABN, First Publish Date - 2022-08-18T03:34:34+05:30
ఎన్నికలకు ముందు పారిశుధ్య కార్మికులకు వేతనాలు పెంచుతామని చెప్పిన జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక మొండిచేయి
అల్లూరు, ఆగస్టు 17: ఎన్నికలకు ముందు పారిశుధ్య కార్మికులకు వేతనాలు పెంచుతామని చెప్పిన జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక మొండిచేయి చూపించారని మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి పెంచల నరసయ్య ఆరోపించారు. బుధవారం అల్లూరులోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం వచ్చాక కొద్దిరోజుల్లోనే వేతనాలను పెంచుతామని హామీ ఇచ్చిన సీఎం నేడు పారిశుధ్య కార్మికులను విస్మరించారని తెలిపారు. ఇలానే వ్యవహరిస్తే పోరాటం చేస్తామన్నారు. పారిశుధ్య కార్మికుల సంఘం నూతన కమిటీ ఎంపిక నిర్వహించిన అనంతరం నగర పంచాయతీ కమిషనరు ఫణికుమార్కు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పీ భాస్కర్, అబ్దుల్ రషీద్, కే విజయలక్ష్మి, ఎన్.రమణయ్య, తిరుపాలు, శీనయ్య, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-18T03:34:34+05:30 IST