పాఠశాలల అభివృద్ధికి చర్యలు
ABN, First Publish Date - 2022-01-26T03:49:03+05:30
మండలంలోని గండిపాళెం జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని జీఎంకే ట్రస్టు అధినేత, మండల పరిషత్ ఉపాఽధ్యక్షుడు గుంటుపల్లి మాలకొండయ్యచౌదరి పేర్కొన్నారు.
ఉదయగిరి రూరల్, జనవరి 25: మండలంలోని గండిపాళెం జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని జీఎంకే ట్రస్టు అధినేత, మండల పరిషత్ ఉపాఽధ్యక్షుడు గుంటుపల్లి మాలకొండయ్యచౌదరి పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో వసతుల కల్పనపై చర్చించారు. తమ ట్రస్టు ఆధ్వర్యంలో క్రీడామైదానం అభివృద్ధితోపాటు విద్యార్థులకు అవసరమైన క్రీడా సామగ్రిని అందజేస్తున్నట్లు తెలిపారు. బుధవారం నిర్వహించే గణతంత్ర వేడుకల కోసం రూ.5 వేలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పాముల రమణయ్య, పీఎంసీ చైర్మన్ షేక్ రియాజ్, అడుసమల్లి వెంకటసుబ్బయ్య, హెచ్ఎంలు వెంకటేశ్వర్లు, జాఫర్సాహెబ్, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-26T03:49:03+05:30 IST