ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుక డంపింగ్‌తో పొంచి ఉన్న ప్రమాదాలు

ABN, First Publish Date - 2022-08-18T03:36:31+05:30

కావలి జడ్పీ ఉన్నత పాఠశాలలో నాడు-నేడు పథకం పేరుతో ఇసుక డంపింగ్‌ చేయటంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రమా

ఇసుక డంపింగ్‌ను పరిశీలిస్తున్న సీపీఎం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలి, ఆగస్టు 17: కావలి జడ్పీ ఉన్నత పాఠశాలలో నాడు-నేడు పథకం పేరుతో ఇసుక డంపింగ్‌ చేయటంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రమాదం పొంచి ఉందని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. బుధవారం వారు పాఠశాలలో డంప్‌ చేసిన ఇసుకను, ఇసుక వాహనాల రాకతో పడిపోయిన గేటు దిమ్మెను పరిశీలించారు.   సీపీఎం పట్టణ   కార్యదర్శి  పీ పెంచలయ్య మాట్లాడుతూ  పట్టణంలో ఉన్న ఒకే ఒక జడ్పీ ఉన్నత పాఠశాలలో సుమారు 250 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. పాఠశాలల విలీనం తర్వాత 3,4,5 తరగతులకు చెందిన చిన్నపిల్లలు కూడా వస్తున్నారని తెలిపారు. ఈ పాఠశాలకు ఒకే  గేటు ఉండటంతో అందరూ ఒకే మార్గంలో రాకపోకలు సాగించాల్సి ఉందన్నారు. ఆ గేటు ద్వారానే ఇసుక తరలింపునకు వాహనాలు రాకపోకలు సాగించాల్సి ఉన్నందున ప్రమాదాలు పొంచి ఉన్నాయన్నారు. ఉన్నతాధికారులు స్పందించి అక్కడ ఇసుక డంప్‌ చేయకుండా చర్యలు  తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు వై. కృష్ణమోహన్‌, పీ. పెంచలనరసింహం, మధుసూదన్‌రావు, డీవైఎఫ్‌ఐ నాయకులు మోతేసాయి, చిత్ర తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-18T03:36:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising