పీహెచ్సీలో చెట్ల నరికివేతపై విచారణ
ABN, First Publish Date - 2022-08-10T04:30:23+05:30
స్థానిక పీహెచ్సీలో చెట్ల నరికివేతపై మంగళవారం అధికారి బీఎల్ దయాకర్ విచారణ జరిపారు.
అనంతసాగరం, ఆగస్టు 9: స్థానిక పీహెచ్సీలో చెట్ల నరికివేతపై మంగళవారం అధికారి బీఎల్ దయాకర్ విచారణ జరిపారు. వివరాల మేరకు 2019 డిసెంబరు19న ఆసుపత్రిలో ఉన్న వివిధ రకాల కొన్ని చెట్లను అటెండర్ జయకృష్ణ, హెచ్ఎస్ బాలకొండయ్య నరికి అమ్ముకొన్నట్లు డైౖరెక్టర్ ఆఫ్ హెల్త్కు రత్నం అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దాందో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పెంచలయ్య ఆదేశాల మేరకు దయాకర్ వైద్యాధికారి, యూడీసీ, సిబ్బందితో పాటు అభియోగం ఎదుర్కొంటున్న వారిని విడివిడిగా విచారించారు. అనంతరం ముగ్గురు గ్రామస్థులను విచారించగా జయకృష్ణ, బాలకొండయ్యకు చెట్లు నరికిన విషయంలో ఎలాంటి సంబందం లేదని వాగ్మూలం ఇచ్చారు. నివేదికను ఉన్నత అధికారులకు అందిస్తామని విచారణాధికారి తెలిపారు.
Updated Date - 2022-08-10T04:30:23+05:30 IST