ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ ఏడాది నుంచి కేజీబీవీలో ఇంటర్‌ ప్రవేశాలు

ABN, First Publish Date - 2022-06-24T03:46:32+05:30

: జిల్లాలోని 8 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఇంటర్‌ కోర్సుల ప్రారంభానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇంట

సీతారామపురంలోని కేజీబీ విద్యాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీతారామపురం, జూన్‌ 23: జిల్లాలోని 8 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఇంటర్‌ కోర్సుల ప్రారంభానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.  ఇంటర్‌ ప్రథమ సంవత్సరం కోర్సుకు అనుమతిస్తూ రాష్ట్ర సమగ్ర శిక్షా అభియాన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. 2018-19 నుంచే రాష్ట్రంలో 221 పాఠశాలల్లో ఇంటర్‌ విద్యను ప్రవేశ పెట్టగా, తాజాగా (2022-23 విద్యా సంవత్సరానికి) మరో 131 కేజీబీవీల్లో ఇంటర్‌ విద్యకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా జిల్లాలోని గుడ్లూరు(హెచ్‌ఈసీ గ్రూపు), కందుకూరు(అగ్రికల్చర్‌), లింగసముద్రం(హెచ్‌ఈసీ), ఉలవపాడు(ఎంపీసీ), కొండాపురం(ఎంపీసీ), కలిగిరి(ఎంపీహెచ్‌డబ్ల్యు), ఏఎస్‌పేట(బైపీసీ), సీతారామపురం(నర్సింగ్‌, ఎంపీసీ) కేజీబీవీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్‌ విద్యను అమలు చేయనున్నారు. ఇంటర్‌ ప్రారంభమైతే ఆ కేజీబీవీల్లో విద్యార్ధినుల సంఖ్య పెరుగుతుంది. ఈ మేరకు బోధకులు, సిబ్బంది అవసరమవుతారు.


Updated Date - 2022-06-24T03:46:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising