ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం

ABN, First Publish Date - 2022-11-28T22:52:28+05:30

సీతారామపురం మోడల్‌స్కూల్‌ సమీపంలో కడప జిల్లాకు చెందిన ఎం సుబ్బారావును హత్య చేసి తగులబెట్టిన కేసుపై సమగ్ర దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోందని కావలి డీఎస్పీ ఏ వెంకటరమణ తెలిపారు.

సీతారామపురంలో సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న కావలి డీఎస్పీ వెంకటరమణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉదయగిరి రూరల్‌/సీతారామపురం, నవంబరు 28 : సీతారామపురం మోడల్‌స్కూల్‌ సమీపంలో కడప జిల్లాకు చెందిన ఎం సుబ్బారావును హత్య చేసి తగులబెట్టిన కేసుపై సమగ్ర దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోందని కావలి డీఎస్పీ ఏ వెంకటరమణ తెలిపారు. సోమవారం ఆయన సీతారామపురం చేరుకుని హత్య జరిగిన ఇంటిని, మృతదేహాన్ని కాల్చిన ప్రదేశాన్ని, పరిశీలించారు. పోలీసు స్టేషన్‌కు చేరుకుని రికార్డులు పరిశీలించారు. అక్కడి నుంచి ఉదయగిరి సర్కిల్‌ కార్యాలయానికి చేరుకుని విలేకర్లతో మాట్లాడుతూ మృతుడు కడప జిల్లా కాశినాయన మండలం కాండ్రాజుపల్లికి చెందిన సుబ్బారావుగా గుర్తించామన్నారు. త్వరలో కేసుకు సంబంఽధించి నిందితులను పట్టుకుంటామని పేర్కొన్నారు. అందుకోసం జిల్లా ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు ఉదయగిరి సీఐ గిరిబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. అనంతరం పోలీసులకు తగు సూచనలు చేసిన ఆయన శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి పోలీసుపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ వీ.గిరిబాబు, ఎస్‌ఐ కిషోర్‌బాబు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-28T22:52:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising