ఇళ్ల స్థలాలపై రాజకీయాలు చేయొద్దు
ABN, First Publish Date - 2022-09-28T04:00:57+05:30
ళ్ల స్థలాల కేటాయింపుపై రాజకీయాలు చేయొద్దని ముదివర్తి గ్రామానికి చెందిన దళిత కాలనీ వాసులు కోరారు.
విడవలూరు, సెప్టెంబరు 27: ఇళ్ల స్థలాల కేటాయింపుపై రాజకీయాలు చేయొద్దని ముదివర్తి గ్రామానికి చెందిన దళిత కాలనీ వాసులు కోరారు. గ్రామంలో మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ 18 ఏళ్ల క్రితం అప్పటి, ఇప్పటి కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇళ్ల స్థలాలు లేని నీరుపేదలకు స్థలాలను కేటాయించారన్నారు. కొందరు అడ్డంకులు సృష్టించడంతో పట్టాల పంపీణీ నిలిపివేశారన్నారు. ప్రస్తుతం వైసీపీ నాయకుడు కొండూరు వెంకటసుబ్బారెడ్డి సహకారంతో ఇళ్ల స్థలాలను ఇస్తుంటే గ్రామానికి చెందిన కొందరు ఇవ్వకుండా రాజకీయాలు చేయడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో దళిత కాలనీ వాసులు ఉల్లాసం ఆనిల్కుమార్, నన్నం కవిత, చికిరి మస్తాన్, వెంకటకృష్ణయ్య, పద్మమ్మ, కప్పల పాపాయ్య, నావూరు గోపి, నావూరు వెంకటేశ్వర్లు, వల్లిరాంబాబు, నెల్లూరు నిరీష్, ముసలి రామకృష్ణ పాల్గొన్నారు.
Updated Date - 2022-09-28T04:00:57+05:30 IST