ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోలు నగదు చెల్లించాలని వినతి

ABN, First Publish Date - 2022-05-24T03:17:09+05:30

గత సీజన్‌లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఇంతవరకు నగదు చెల్లించలేదని, వెంటనే బకాయిలు చెల్లించి ఆదుకోవాల్సిందిగా

కలెక్టరు చక్రధరబాబుకు వినతిపత్రం సమర్పిస్తున్న టీడీపీ రైతు సంఘ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కోవూరు, మే23 : గత సీజన్‌లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఇంతవరకు నగదు చెల్లించలేదని, వెంటనే బకాయిలు చెల్లించి ఆదుకోవాల్సిందిగా  టీడీపీ రైతు సంఘ జిల్లా నాయకులు సోమవారం కలెక్టరు చక్రధరబాబుకు వినతిపత్రం సమర్పించారు. కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో ఆయనకు వారు సమస్యలను వివరించా రు.మార్చిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి ఇంతవరకు నగదు చెల్లించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు.  ప్రభుత్వం అనుసరించిన విధానం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి విపత్కర పరిస్ధితుల్ని చవిచూడలేదన్నారు. జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో చక్కెర కర్మాగారాన్ని తెరుస్తామని హామీ యిచ్చారన్నారు. ఇంతవరకు షుగర్‌ ఫ్యాక్టరీ సమస్యలపై ప్రభుత్వం, ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి స్పందించలేదన్నారు. చక్కెర కర్మాగార సమస్యలకు పరిష్కారం చూపాల్సిందిగా టీడీపీ నాయకులు కలెక్టరును కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రైతు సంఘ జిల్లా నాయకులు నెల్లూరు ప్రభాకరరెడ్డి, జీ రాధాకృష్ణయ్య,  ఇంతా మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-24T03:17:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising